మూర్చతో 12 మందికి అస్వస్థత
ABN , First Publish Date - 2020-12-06T00:26:19+05:30 IST
మూర్చతో 12 మందికి అస్వస్థత
పశ్చిమగోదావరి: జిల్లాలో ఏలూరు పడమర వీధిలో పలువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 12 మంది స్థానికులు మూర్చతో పడిపోయారు. బాధితుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పడమర వీధిలో 10 మంది, దక్షిణపు వీధిలో ఇద్దరు మూర్చతో పడిపోయారు. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి ఆదేశించారు.