కారు ఢీకొని మోటార్ సైక్లిస్టు మృతి
ABN , First Publish Date - 2021-06-24T04:53:14+05:30 IST
ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో మోటార్ సైక్లిస్టు మృతిచెందాడు.
దెందులూరు, జూన్ 23: ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో మోటార్ సైక్లిస్టు మృతిచెందాడు. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మం డలంలోని గోపన్నపాలెం పరిధిలో జంగా రెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు ఏలూరు నుంచి మొండూరు వైపు మోటార్ సైకిల్పై ఇంటికి వస్తున్న రామారావుగూడెంకు చెందిన శిలు శివ (28)ను ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు గ్రామంలోని పెట్రోలు బంక్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం డ్యూటీ దిగి నిత్యావసర సరుకులు కోసం ఏలూరు వెళ్లి సరుకులు తీసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం ఏలూరు తరలించారు. కారులోని వ్యక్తి కారు వదిలి పారిపోయినట్టు సమాచారం. మృతుడు శివకు భార్య, బాబు ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భవతి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రామారావుగూడెం గ్రామస్థులు ప్రమాద స్థలం వద్ద నిరసనకు దిగారు.