బుద్ధ పార్కును మరింత అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2021-12-03T05:40:01+05:30 IST
బుద్ధ పార్కును మ రింత అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం త్వరలో అను మతిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ అన్నా రు.
ఏలూరు రూరల్, డిసెం బరు 2 : బుద్ధ పార్కును మ రింత అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం త్వరలో అను మతిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ అన్నా రు. ఏలూరుకు గురువారం విచ్చేసిన ఆమె బుద్ధ పార్కును సందర్శించారు. మేయర్ నూర్జహాన్, రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, కమిషనర్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. రామకోటిలోని ప్రాంగణం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు.