ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-01-22T05:08:17+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను ఏవిధంగా నిర్వహించారన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేం దుకు కేంద్ర ప్రత్యేక బృందం కొవ్వలిలో పర్యటించింది.

ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
కొవ్వలిలో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

దెందులూరు, జనవరి21 : జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన  పనులను ఏవిధంగా నిర్వహించారన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేం దుకు కేంద్ర ప్రత్యేక బృందం కొవ్వలిలో పర్యటించింది. కొవ్వలి, దోసపాడుల్లో  జరిగిన పనులను కేంద్ర పరిపాలన నిధుల పర్యవేక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్‌, దాస్‌లతో కూడిన బృందం పరిశీలించింది. ఏపీవో దశరథ రాంజీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయం, ఉపాధి కార్యాలయంలో రికార్డుల ను పరిశీలించారు. మోటపర్తి భవన్‌లో సమావేశం నిర్వహించి పలు శాఖల్లో జరిగిన పనులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో లక్ష్మీ, తహసీల్దార్‌  నాంచా రయ్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:08:17+05:30 IST