వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-05-14T05:39:37+05:30 IST
కరోనాతో టీడీపీ నాయకులు మృతి చెందారు.
కొయ్యలగూడెం, మే 13: కరోనాతో ఇద్దరు టీడీపీ నాయకులు మృతి చెందారు. ఈ సంఘటన కొయ్యలగూడెం మండలంలో గురువారం చోటు చేసుకున్నది. అచ్యుతాపురం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. అదే విధంగా బయ్యన్నగూడెం గ్రామంలో మరో టీడీపీ నాయకుడు కరోనాతో మృతి చెందాడు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 85 సంవత్సరాలు వృద్ధుడు కరోనాతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో మునిసిపల్ సిబ్బంది దహన సంస్కారాలు చేశారు.