కరోనా...అప్‌డేట్‌

ABN , First Publish Date - 2021-06-12T05:00:14+05:30 IST

పలు మండలాల్లో కరోనా కేసుల వివరాలు

కరోనా...అప్‌డేట్‌

ఉంగుటూరు... 39: ఉంగుటూరు మండలంలో 39 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నారాయణపురం 8, చేబ్రోలు, రాచూరులలో 5 చొప్పున, ఉంగుటూరు 4, నీలాద్రిపురం, నాచుగుంటలలో 3చొప్పున, గోపాలపురం, యర్రమిల్లిపాడు, కాకర్లమూడిలలో రెండేసి చొప్పున ఉప్పాకపాడు, బాదంపూడి, బొమ్మిడి, గొల్లగూడెం, అక్కుపల్లిగోకవరంలలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు తెలిపారు.

 అత్తిలి...29: అత్తిలి మండలంలో 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యాధికారిణి ప్రసన్నకుమారి తెలిపారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో 23, మంచిలి పీహెచ్‌సీ పరిధిలో 6 పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలిపారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 77  కొవిడ్‌ పరీక్షలు జరిపినట్లు తెలిపారు.

 తణుకు...19: తణుకు పట్టణం, రూరల్‌ పరిధిలో 19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు చెప్పారు. అర్బన్‌లో 15, రూరల్‌లో 4 కేసులు వచ్చాయన్నారు

 పెరవలి...17: కానూరు ఆరోగ్యకేంద్ర పరిఽధిలో 98 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 520 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. పెరవలి ఆరోగ్యకేంద్ర పరిఽధిలో 63 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పది పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  తెలిపారు. 514 మందికి వ్యాక్సిన్‌లు వేసినట్లు తెలిపారు.

 ఉండ్రాజవరం...16: ఉండ్రాజవరం మండలంలో 16 కరోనా కేసులు నమోదైనట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. చివటం 2, కె. సావరం 1, కాల్థరి 3, మోర్త 1, పాలంగి 2, తాడిపర్రు 1,ఉండ్రాజవరం 5, వడ్లూరు 1 కేసులు నమోదైనట్లు తెలిపారు.

 పెంటపాడు...12: ముదునూరు, పెంటపాడు పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం 12 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రత్తిపాడు 3, రాచర్ల 3,   పెంటపాడు 2, అలంపురం, ఆకుతీగపాడు, బీ.కొండేపాడు, రావిపాడు గ్రామాలలో ఒక్కో కేసు నమోదయ్యాయన్నారు.

 భీమడోలు...11: భీమడోలు మండలంలో తాజాగా 11 కరోనా కేసులు నమోదైనట్లు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. పూళ్ళ 3, పోలసానపల్లి 2, భీమడోలు 2, సూరప్పగూడెం 1, చెట్టున్నపాడు 2, గుండుగొలను 1 కేసు నమోదైనట్లు తెలిపారు. 

 తాడేపల్లిగూడెం...9: తాడేపల్లిగూడెం మండలంలో శుక్రవారం 9 కరోనా కేసులు నమోదైనట్టు ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు తెలిపారు. కుంచనపల్లి 4, పడాల 2, దండగర్ర 2, జగన్నాఽథపురం 1 కరోనా కేసులు నమోదైనట్టు వివరించారు. 

 నిడదవోలు...7: నిడదవోలు పట్టణ పరిధిలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

 ఇరగవరం... 2: ఇరగవరం, జూన్‌ 11: రేలంగి పీహెచ్‌సీ పరిధిలో 57 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇరగవరం పీహెచ్‌సీ పరిధిలో 42 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా కత్తవపాడు–1, అయినపర్రు–1 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 45 ఏళ్ళ పైబడిన వారికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసును 1173 మందికి అర్జునుడుపాలెం, ఓగిడి, కాకిలేరు, కత్తవపాడు, కేతావారిపాలెం, కె.ఇల్లింద్రపర్రు గ్రామాలలో అందించినట్లు పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు.


Updated Date - 2021-06-12T05:00:14+05:30 IST