లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు నిరోధించాలి

ABN , First Publish Date - 2022-01-28T05:14:02+05:30 IST

ఏలూరు చేపల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు చేపట్టి తమ వ్యాపారానికి గండి కొడుతున్నారని, లైవ్‌ ఫిష్‌ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ ఏలూరు వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు.

లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు నిరోధించాలి
చేపల మార్కెట్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న చేపల నిర్వాహకులు

వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన
ఏలూరు రూరల్‌, జనవరి 27 : ఏలూరు చేపల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు చేపట్టి తమ వ్యాపారానికి గండి కొడుతున్నారని, లైవ్‌ ఫిష్‌ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ ఏలూరు వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లా డుతూ ఇటీవల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ వ్యాపారస్తులు కొనుగోలుదారు లను లోనికి రానివ్వకుండా బయట దుకాణాలు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నే ళ్లుగా చేపల మార్కెట్‌లో అద్దెలు చెల్లిస్తూ వ్యాపారం సాగిస్తున్నామన్నారు. ఇటీ వల ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు తెగబడ్డారని ఈ వ్యవహారం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపా యలు మునిసిపాలిటీకి అద్దెల రూపంలో చెల్లిస్తున్నామని, లైవ్‌ఫిష్‌ వ్యాపారంతో వ్యాపారం లేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తు న్న విషయం పోలీసులు తెలుసుకుని అక్కడకు చేరుకుని మహిళలతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-01-28T05:14:02+05:30 IST