భౌతికదూరం ఊసే మరిచారు.

ABN , First Publish Date - 2021-05-17T05:28:48+05:30 IST

భౌతికదూరం పాటించరు.. మాస్క్‌లు ధరిం చరు..

భౌతికదూరం ఊసే మరిచారు.
పవర్‌పేట వద్ద రద్దీ

.ఏలూరు రూరల్‌, మే 16 : భౌతికదూరం పాటించరు.. మాస్క్‌లు ధరిం చరు.. కరోనా నిబంధనలు అసలే పట్టించుకోరు.. అయినా ఏ మాత్రం భయపడరు.  ఇది నగర ప్రజానీకం తీరు. ఉదయం వేళల్లో నగరంలో రద్దీ నెలకొంటోంది. దుకాణాల వద్ద జనం గుమిగూడిన ఏ ఒక్క శాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు.  కర్ఫ్యూ అమలు సమయంలో కట్టడి చర్యలు గతం కన్నా మరింత అధికంగా కనిపిస్తున్నా కొన్ని చోట్ల పోలీసులు అధికారులు తీసుకుంటు న్న చర్యలు అత్యవసర పనులకు వచ్చేవారు, కొవిడ్‌ బాధితులు, విధు లు నిర్వహించేవారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు పలు చోట్ల బారికేడ్లతో రోడ్లు మూసి వేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-05-17T05:28:48+05:30 IST