ముగిసిన త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-17T05:41:23+05:30 IST

రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి త్రిస ప్తాహ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.

ముగిసిన త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు
అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 16: రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి త్రిస ప్తాహ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, శాంతి పాఠం, చక్రసాన్నం కార్యక్రమాలు నిర్వహిం చారు. తొలుత అమ్మవార్లకు, శ్రీవారికి అభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ జరిపి ప్రత్యేక హారతులు ఇచ్చి నివేదనలు సమర్పించి ఆరాధిం చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించు కుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు భక్తులు స్వామికి బంగారు పుష్పాలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు భక్తులతో పూజలు చేయించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొంపల్లి తాయారు, ధర్మకర్తలు,  సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-01-17T05:41:23+05:30 IST