జాతీయ స్థాయి స్క్వాయ్ పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2021-12-07T04:53:36+05:30 IST
గోవాలో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి స్క్వాయ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు స్క్వాయ్ కోచ్ ఎం.డి. కాజా ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు స్పోర్ట్స్, డిసెంబరు 6 : గోవాలో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి స్క్వాయ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు స్క్వాయ్ కోచ్ ఎం.డి. కాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఎంపిక పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. బాలికల విభాగంలో కె.శశికుమారి, ఎస్.హర్షిత సాయి, నవదీపిక, పురుషుల విభాగంలో పి.కార్తీక్, బి.కార్తీక్, కె.రాజేష్, ఎం.డి.అహ్మద్ రజా, బి.నిర్మల కుమార్, ఎం.డి.కాజావలీ, ఎం.డి.ఓవైసీ రాజా, పి.హేమంత్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయా విభాగాల్లో జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.