మద్యం మత్తులో పట్టాలు దాటుతుంటే..

ABN , First Publish Date - 2022-01-24T04:11:41+05:30 IST

మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు.

మద్యం మత్తులో పట్టాలు దాటుతుంటే..

ఏలూరుక్రైం, జనవరి 23 : మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని మర్లపాలెం చెరువు దగ్గర రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్టుగా రైల్వే పోలీసులకు సమాచారం అందింది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.ఆదినారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి ఆదివారం ఉద యం వెళ్లి పరిశీలించారు. మృతుడు గన్నవరానికి చెందిన ఉత్సల మురళి (48)గా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై విధులకు హాజరు కాకుండా ప్రైవేటు వ్యాను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతిగా మద్యం తాగే అలవాటు ఉంది. శనివారం రాత్రి మర్లపాలెం చెరువు సమీపంలోని రైలు పట్టాలను మద్యం మత్తులో దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బం ధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నారు.

Updated Date - 2022-01-24T04:11:41+05:30 IST