ముమ్మరంగా మాసూళ్లు

ABN , First Publish Date - 2021-04-17T05:28:43+05:30 IST

జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ముమ్మరంగా మాసూళ్లు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 16: జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం కోతలు పూర్త య్యాయి. ఈ ఏడాది లక్షా 91 వేల హెక్టార్లలో సాగు చేయగా 38 వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేతికొచ్చిన పంటను కోత కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈసారి రబీలో లక్ష్యానికి మించి సాగు జరిగిందని, మంచి దిగుబడులు వస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందు తున్నారు. రెండు రోజుల క్రితం ఈదురుగాలులు, వర్షాలకు పలుచోట్ల చేలు నేల కొరిగాయని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దెందులూ రు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడమర్రు మండలాల్లో పంట పూర్తిగా తడిసిపో యిందని, కోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-17T05:28:43+05:30 IST