నాడు ఉచితం.. నేడు అమ్మకం..!

ABN , First Publish Date - 2021-07-31T05:32:56+05:30 IST

గత తెలుగుదేశం హయాం లో రైతులకు జింకు, జిప్సమ్‌ తదితర ప్రధానమైన సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు ఉచితంగా అందజేసింది.

నాడు ఉచితం.. నేడు అమ్మకం..!

  రాయితీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

  ఆర్బీకేల్లో జింక్‌, జిప్సమ్‌ కొనాల్సిందే..

  ఆర్థిక భారంపై రైతుల ఆవేదన

ఏలూరు రూరల్‌, జూలై 30: గత తెలుగుదేశం హయాం లో రైతులకు జింకు, జిప్సమ్‌ తదితర ప్రధానమైన సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు ఉచితంగా అందజేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తూ రైతులపై ఆర్థిక భారం మోపుతోంది. ప్రస్తుతం జిప్సమ్‌, జింకు ఎరువులు కోసం రైతులు ముందుగానే పూర్తి ధర చెల్లిస్తూ బ్యాంకులో డీడీలు తీయాలి. రాయితీని ప్రభుత్వం ఇంకా నిర్ణయించ లేదు. డీడీ తీసిన రసీ దును ఆర్బీకేలో అంద జేస్తే ఆపై రైతుకు ఎరువులను అందజేస్తారు. ప్రస్తుతం కిలో జిప్సమ్‌ రూ.350, జింకు రూ.53 ఉంది. దీని ప్రకారం రైతులు బ్యాంకులకు ముందు గానే డబ్బులు చెల్లించాలి. ప్రభుత్వం రాయితీ ఎంత ఇస్తుందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. అప్పులు చేసి ఎరువులు కొనే పరిస్థితి ఏర్పడింది. కొవిడ్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత ఆర్థిక భారం మోపుతుండడం విమర్శలకు తావిస్తోంది.


 ఎరువులు కొనలేం : రామకృష్ణ, దొండపాడు

గత ప్రభుత్వ హయాంలో జిప్సమ్‌, జింకు ఎరువులు ఉచితంగా ఇచ్చేవారు. అప్పట్లో పంటలకు విరివిగా వాడే వాళ్లం. దిగుబడి బాగా వచ్చేది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వాటి ధరలను విపరీతంగా పెంచి విక్రయి స్తోంది. వీటిని కొనలేకపోతున్నాం. 

దిగుబడి తగ్గుతుంది : సుబ్బారావు, రైతు, మాదేపల్లి

సూక్ష్మపోషకాలైన జిప్సం, జింకు ఎరువులను ఆర్‌బీకేల ద్వారా సకాలంలో ఇవ్వడం లేదు. ధరలు బయట అధికంగా ఉండడంతో కొనలేకపోతున్నాం.


Updated Date - 2021-07-31T05:32:56+05:30 IST