ప్రణాళికాబద్ధంగా భూముల రీసర్వే : జేసీ

ABN , First Publish Date - 2021-05-06T04:58:56+05:30 IST

జిల్లాలో ప్రణాళికా బద్ధంగా భూముల రీసర్వే చేస్తున్నామని జిల్లా జాయి ంట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా భూముల రీసర్వే : జేసీ
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసీ వెంకటరమణారెడ్డి

ఏలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రణాళికా బద్ధంగా భూముల రీసర్వే చేస్తున్నామని జిల్లా జాయి ంట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. వెలగపూడి నుంచి భూముల రీసర్వే, ఇళ్ల పట్టాల పంపిణీపై ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగేందుకు యాక్షన్‌ ప్లాన్‌తో వెళుతున్నామని చెప్పారు. జిల్లాలోని 4 డివిజన్ల లోని నాలుగు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. వీసీలో సర్వే శాఖ ఏడీ లక్ష్మణ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-05-06T04:58:56+05:30 IST