బియ్యం సేకరణలో నాణ్యత మరువొద్దు : జేసీ

ABN , First Publish Date - 2021-12-07T05:00:15+05:30 IST

ఖరీఫ్‌ సీజనులో సేకరి స్తున్న బియ్యం నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

బియ్యం సేకరణలో  నాణ్యత మరువొద్దు : జేసీ
అధికారులతో మాట్లాడుతున్న జేసీ

పెదవేగి, డిసెంబరు 6: ఖరీఫ్‌ సీజనులో సేకరి స్తున్న బియ్యం నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. వంగూరులోని రంగ రాయ గోదాములో నిల్వ చేసిన బియ్యాన్ని జేసీ సోమ వారం పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీప్‌ సీజను లో నిర్దేశిత లక్ష్యంమేర బియ్యం సేకరణ చేపట్టా మన్నారు. సేకరించిన బియ్యాన్ని గోదాము ల్లో నిల్వ చేస్తున్నామని, మిల్లుల నుంచి బియ్యం సేకరించే సమయంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఏ మాత్రం నాణ్య త తగ్గినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ డి. రాజు, పౌరసరఫరాల అధికారి సుబ్బరాజు, సాంకే తిక సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-12-07T05:00:15+05:30 IST