గుంటూరు జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది?

ABN , First Publish Date - 2020-08-03T22:19:46+05:30 IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం గుంటూరు జిల్లా.

గుంటూరు జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది?

గుంటూరు: ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం గుంటూరు జిల్లా. అలాంటి జిల్లాకు  వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చూస్తే చెప్పేందుకు ఏమీ లేదు. అమరావతి నుంచి రాజధాని మారుస్తామని చెప్పడంతోనే గుంటూరు ప్రజల గుండెలు అదిరిపోయాయి. ఇక పల్నాడులో వైద్య కళాశాల ఏర్పాటు, వరికపూడెశల ప్రాజెక్టుకు నిధులు. జాషువా స్మారక కేంద్రం ఏర్పాటు తప్ప జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీలేదనే విమర్శలు ఉన్నాయి. 


ఇక అధికారపార్టీ నేతల దౌర్జన్యాలు, ప్రతిపక్ష నేతలపై కేసులు సరేసరి.. కొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం, మాజీ శాసనసభాపతి కోడెల ఆత్మహత్య, స్థానిక ఎన్నికల సందర్భంగా మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై దాడి, వైసీపీ కక్ష పూరిత వైఖరికి పరాకాష్ఠగా నిలిచాయి. కాగా గుంటూరుజిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాల్లో 15 సీట్లు వైసీపీ గెలుచుకుంది. మూడు ఎంపీ స్థానాల్లో రెండు సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది.

Updated Date - 2020-08-03T22:19:46+05:30 IST