పగలూ, రాత్రీ ఏం పనబ్బా?
ABN , First Publish Date - 2021-06-20T06:21:23+05:30 IST
అసలే కరోనా కాలం. అందునా కర్ఫ్యూ. ఆంక్షలు, నిబంధనలు అమలులో ఉన్న రోజులు. అయినా పలమనేరు పట్టణంలోని మైన్స్ ఏడీ కార్యాలయం మాత్రం గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల వరకు పనిచేస్తోంది.
పలమనేరు : అసలే కరోనా కాలం. అందునా కర్ఫ్యూ. ఆంక్షలు, నిబంధనలు అమలులో ఉన్న రోజులు. అయినా పలమనేరు పట్టణంలోని మైన్స్ ఏడీ కార్యాలయం మాత్రం గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల వరకు పనిచేస్తోంది. పగలూ రాత్రీ సిబ్బంది బిజీ బిజీగా పనిచూస్తూ కనిపిస్తున్నారు. ఈ కార్యాలయంలోనే పలువురు కొవిడ్ బారిన పడ్డారు కూడా. ఒకరి కుటుంబ సభ్యులు చనిపోయారు. అయినా అంత అత్యవసర విధులు ఏమిటో, ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కోసం రాత్రి అయినా పనిచేయక తప్పడం లేదని ఒక అధికారి చెబుతున్నారు. అటువంటి అవసరమే ఉంటే 80 శాతం మంది సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఏమిటో అంతుపట్టడం లేదు. వీరి కర్తవ్య దీక్షకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.