పెళ్లి మంటపంలో ఉండాల్సిన వధువు.. ఇక్కడ ఉందేంటి..? అవాక్కైన కుర్రాళ్లు.. అసలు సంగతి తెలిసి..

ABN , First Publish Date - 2021-11-24T20:03:26+05:30 IST

పెళ్లి జరిగే రోజు అంటే ఎంతో హడావుడిగా ఉంటుంది. ఆ రోజంతా వధూవరులు చాలా బిజీబిజీగా గడుపుతారు.

పెళ్లి మంటపంలో ఉండాల్సిన వధువు.. ఇక్కడ ఉందేంటి..? అవాక్కైన కుర్రాళ్లు.. అసలు సంగతి తెలిసి..

పెళ్లి జరిగే రోజు అంటే ఎంతో హడావుడిగా ఉంటుంది. ఆ రోజంతా వధూవరులు చాలా బిజీబిజీగా గడుపుతారు. పెళ్లి దుస్తులు ధరించి ముస్తాబవడం, పూజారి ముందు కూర్చొని పూజలు చేయడం.. ఇలా పెళ్లి తంతు ఒక రోజంతా ఉంటుంది. అయితే రాజ్‌కోట్‌కు చెందిన ఓ యువతి పెళ్లి రోజునే పరీక్ష రాయడానికి వెళ్లి అందరికీ షాకిచ్చింది. పెళ్లి దుస్తులు ధరించి ఎగ్జామ్ హాల్‌కు వచ్చిన యువతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 


రాజ్‌కోట్‌కు చెందిన శివంగి భక్తరియా అనే యువతి సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతోంది. ప్రస్తుతం ఐదో సెమిస్టర్‌లో ఉన్న ఆమెకు పెళ్లి నిశ్ఛయమైంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆమె పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే పెళ్లి తేది పెట్టుకున్న తర్వాత సౌరాష్ట్ర యూనివర్సిటీ ఐదో సెమిస్టర్‌ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఒక పరీక్ష ఆమె పెళ్లి తేదీ నాడే పడింది. అయినా ఆమె పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. 


ఆమె నిర్ణయానికి కాబోయే భర్త, కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. రాజ్‌కోట్‌లోని శాంతినికేతన్ కాలేజీకి ఆమెను కాబోయే భర్త పెళ్లి దుస్తుల్లోనే తీసుకొచ్చాడు. ఆమె పరీక్ష రాసే వరకు ఉండి ఆ తర్వాత తీసుకెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లి కంటే చదువుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిన శివంగిని, ఆమెకు కాబోయే భర్తను, కుటుంబ సభ్యులను నెటిజన్లు అభినందిస్తున్నారు. 



Updated Date - 2021-11-24T20:03:26+05:30 IST