కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన బాలిక.. షాకింగ్ విషయం చెప్పిన డాక్టర్.. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2021-12-22T20:33:50+05:30 IST

ఆ 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది.. చిన్న వయసులోనే తల్లి దూరం కావడంతో నాయనమ్మ ఇంటి దగ్గరే ఉంటూ చదువుకుంటోంది..

కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన బాలిక.. షాకింగ్ విషయం చెప్పిన డాక్టర్.. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే..

ఆ 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది.. చిన్న వయసులోనే తల్లి దూరం కావడంతో నాయనమ్మ ఇంటి దగ్గరే ఉంటూ చదువుకుంటోంది.. ఇటీవల ఆమెకు కడుపునొప్పి రావడంతో నాయనమ్మ ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది.. స్కానింగ్ తీయించిన డాక్టర్ షాకింగ్ విషయం చెప్పాడు.. ఆ బాలిక ఆరో నెల గర్భవతి అని చెప్పాడు.. అప్పుడు ఆ బాలిక అసలు విషయం చెప్పింది.. దీంతో ఆమె తండ్రి, నాయనమ్మ పోలీసులను ఆశ్రయించారు.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగింది. 


జబల్పూర్‌కు చెందిన 17 ఏళ్ల బాధిత బాలిక తన నాయనమ్మ ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటోంది. తండ్రి వేరే ఊళ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బాలిక నాయనమ్మ ఇంటి మీద పోర్షన్‌లో రోహిత్ అనే వ్యక్తి అద్దెకుండే వాడు. అతను ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట పడేవాడు. ఈ ఏడాది మే నెలలో ఓ వివాహానికి బాలిక నాయనమ్మ వెళ్లింది. ఆ సమయంలో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న రోహిత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు సాయంత్రమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 


రోహిత్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక ఎవరికీ చెప్పలేదు. జూన్ నెల నుంచి ఆమెకు పీరియడ్స్ ఆగిపోయాయి. గత సోమవారం ఆమెకు కడుపునొప్పి రావడంతో నాయనమ్మతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమె గర్భం సంగతి బయటపడింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్ గురించి గాలిస్తున్నారు. 

Updated Date - 2021-12-22T20:33:50+05:30 IST