భవనాశి రిజర్వాయర్ పూర్తి చేసేదేప్పుడు ?
ABN , First Publish Date - 2021-10-15T05:26:48+05:30 IST
జలయజ్ఞంలో శంకుస్థాపన చేసిన భవనాశి రిజర్వాయర్ పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయని, ప్రభుత్వం స్పందించి వెంటనే పనులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.
రైతు సంఘం నేతలు
అద్దంకిటౌన్ అక్టోబరు 14: జలయజ్ఞంలో శంకుస్థాపన చేసిన భవనాశి రిజర్వాయర్ పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయని, ప్రభుత్వం స్పందించి వెంటనే పనులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం భవనాశి జలాశయాన్ని మండలంలోని రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు, పలు గ్రామాలకు భూగర్భజలాల అభివృద్ధి, అద్దంకి పట్టణానికి తాగునీరు సదుపాయం అందించవచ్చనే ఉద్దేశంతో తలపెట్టిన భవనాశి జలాశయం పనులు ప్రారంభమై పుష్కరకాలం దాటినా పూర్తి కాలేదన్నారు. ఆటంకాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమారెడ్డి, గొల్లపూడి వెంకటేశ్వర్లు, చెన్నుపాటి సుబ్బారావు, ప్రసాద్, సత్యనారాయణ పాల్గొన్నారు.