తిరుచానూరు స్టేషన్‌ పనులు పూర్తయ్యేదెన్నడు?

ABN , First Publish Date - 2021-07-22T04:40:18+05:30 IST

రేణిగుంట-తిరుపతి మార్గంలో నిర్మిస్తున్న తిరుచానూరు రైల్వేస్టేషన్‌ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.

తిరుచానూరు స్టేషన్‌ పనులు పూర్తయ్యేదెన్నడు?
అసంపూర్తిగా రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం

రేణిగుంట, జూలై 21: రేణిగుంట-తిరుపతి మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న తిరుచానూరు రైల్వేస్టేషన్‌ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ఏడాది జూలై నెలకల్లా స్టేషన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని గతంలో జోనల్‌ జీఎం హామీఇచ్చినా నత్తనడకన నడుస్తున్నాయి. మొత్తం రూ.53 కోట్ల నిధులతో స్టేషన్‌ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా మూడు ప్లాట్‌ఫాంలు, రెండు అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జిలు, ఫ్లోరింగ్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ ఈ పనులు ముందుకు సాగక పోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం గుంతకల్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ అలోక్‌తివారీ తిరుపతి పర్యటనకు రానున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన తిరుచానూరు రైల్వేస్టేషన్‌ పనులను తనిఖీ చేయనున్నారు. ఇకనైనా డీఆర్‌ఎం చొరవ తీసుకుని పనులను వేగవంతం చేయించాల్సి ఉంది. 

Updated Date - 2021-07-22T04:40:18+05:30 IST