అంధభక్తులు నక్కల్లా మొరిగారు: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

ABN , First Publish Date - 2021-05-11T23:31:20+05:30 IST

ముంబైలో కరోనా కట్టడి చేయడంలో ఉద్ధవ్ థాకరే అద్భుతమైన పనితీరు కనబరిచారని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి ప్రతినిధి కూడా ఈరోజు మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించారు

అంధభక్తులు నక్కల్లా మొరిగారు: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

న్యూఢిల్లీ: కోవిడ్ నియంత్రణలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పనితీరుపై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారని, అయితే ఇదే విషయాన్ని తాను గతంలో చెప్పినప్పుడు కొందరు అంధభక్తులు భయంతో ఉన్న నక్కల్లా తనపైకి ఊరికే మొరిగారని, అయితే ఇప్పుడు వారంతా ఎక్కడికి వెళ్లారని భారతీయ జనతా పార్టీ నేత, పార్లమెంట్ సభ్యులు సుబ్రమణ్యస్వామి అన్నారు. తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా స్పందించారు.


‘‘ముంబైలో కరోనా కట్టడి చేయడంలో ఉద్ధవ్ థాకరే అద్భుతమైన పనితీరు కనబరిచారని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి ప్రతినిధి కూడా ఈరోజు మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించారు. దీనిని బట్టి చూస్తే సీఎంలలో ఉద్ధవ్ థాకరే మోడల్‌గా అనిపించొచ్చు. ఇదే విషయాన్ని నేను గతంలో చెప్పినప్పుడు అంధ, గంధ భక్తులు భయం గుప్పిట్లో ఉన్న నక్కల్లా నాపై మొరిగారు. ఇప్పుడు వాళ్లంతా ఎక్కడికి వెళ్లారు? నగరం డ్రైనేజీల్లోకి వెళ్లారా?’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-05-11T23:31:20+05:30 IST