అంబేడ్కర్ విగ్రహం ఏమైంది?: రాములునాయక్
ABN , First Publish Date - 2020-08-09T09:12:04+05:30 IST
సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ప్రశ్నించారు. సచివాలయం కట్టేందుకు రూ.400 కోట్లు కేటాయించిన కేసీఆర్...
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ప్రశ్నించారు. సచివాలయం కట్టేందుకు రూ.400 కోట్లు కేటాయించిన కేసీఆర్.. అంబేడ్కర్ విగ్రహానికి రూపాయి కూడా ఇవ్వరా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మంత్రులు కళ్లు తెరవాలని, అణగారిన వర్గాలను మోసం చేస్తున్న సీఎంను నిలదీయాలని సూచించారు.