కరోనా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ

ABN , First Publish Date - 2021-05-19T09:47:37+05:30 IST

కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

కరోనా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ

మే 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం రూ.2229 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని.. అందులో రూ.1173 కోట్లు కేవలం మెడిసిన్స్‌, డ్రగ్స్‌ కొనుగోలుకు వెచ్చించినట్లు పేర్కొన్నారన్నారు. అంత డబ్బు ఖర్చుపెట్టి రాష్ట్రంలో ఎక్కడైనా శాశ్వత వైద్య సదుపాయాలు నెలకొల్పారా అని ప్రశ్నించారు.

Updated Date - 2021-05-19T09:47:37+05:30 IST