కరోనాపై సాధించిన విజయాలపై డెల్టా పంజా: డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ABN , First Publish Date - 2021-08-02T02:23:59+05:30 IST

గతేడాది కరోనా మహమ్మారి మొదటగా ప్రపంచంపై విజృంభించింది. ఆ సమయంలో చాలా కష్టపడి మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్..

కరోనాపై సాధించిన విజయాలపై డెల్టా పంజా: డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

జెనీవా: గతేడాది కరోనా మహమ్మారి మొదటగా ప్రపంచంపై విజృంభించింది. ఆ సమయంలో చాలా కష్టపడి మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్.. ఆ తర్వాత వ్యాక్సిన్ వచ్చాక ఈ మహమ్మారిపై దాదాపుగా విజయం సాధించినట్లయింది. కానీ కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లతో ఈ విజయాలు ప్రమాదంలో పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తపరిచింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా పలుదేశాల్లో మరోసారి లాక్‌డౌన్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా వేరియంట్ ఇప్పటికే 132 దేశాలకు వ్యాపించిందని చెప్పిన డబ్ల్యూహెచ్‌వో.. తాము ధ్రువీకరించిన వ్యాక్సిన్లు అన్ని కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని పేర్కొంది.

Updated Date - 2021-08-02T02:23:59+05:30 IST