ముందే ఆ పని చేయాల్సింది.. డబ్ల్యూహెచ్‌వోపై ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కామెంట్

ABN , First Publish Date - 2021-05-13T04:54:07+05:30 IST

కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంత త్వరగా స్పందించి ఉండాల్సిందని ప్యానెల్ ఫర్ ప్యాండెమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్థాపించిన ఈ ప్యానెల్ కరోనా మహమ్మారి గురించి తాజాగా చర్చించింది.

ముందే ఆ పని చేయాల్సింది.. డబ్ల్యూహెచ్‌వోపై ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కామెంట్

జెనీవా: కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంత త్వరగా స్పందించి ఉండాల్సిందని ప్యానెల్ ఫర్ ప్యాండెమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్థాపించిన ఈ ప్యానెల్ కరోనా మహమ్మారి గురించి తాజాగా చర్చించింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిపుణులు.. కరోనా విషయంలో కొంత ముందుగానే అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘‘కరోనాను డబ్ల్యూహెచ్‌వో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ)గా 2020 జనవరి 22న ప్రకటించాల్సింది. కానీ డబ్ల్యూహెచ్‌వో మరో ఎనిమిది రోజులు ఆగి ఆ పని చేసింది’’ అని ప్యానెల్ అభిప్రాయపడింది. ముఖ్యంగా చైనాలో ఆలస్యం జరిగిందని స్పష్టంగా కనబడుతోందని పేర్కొంది.

Updated Date - 2021-05-13T04:54:07+05:30 IST