వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం

ABN , First Publish Date - 2021-01-16T12:59:13+05:30 IST

వూహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం గురువారం చైనాకు చేరుకుంది.

వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం

వూహాన్‌, జనవరి 15: వూహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం గురువారం చైనాకు చేరుకుంది. సింగపూర్‌ నుంచి 15 మంది శాస్త్రవేత్తలు వూహాన్‌కు రావాల్సి ఉండగా, ఇద్దరికి కరోనా ‘పాజిటివ్‌’ నిర్ధారణ కావడంతో 13 మందికే విమాన ప్రయాణ అనుమతులు లభించాయి. వూహాన్‌కు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణులంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ గడువు ముగియగానే.. నిపుణుల బృందం వూహాన్‌లోని మాంసం మార్కెట్‌ కేంద్రంగా కరోనా ఇన్ఫెక్షన్లు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. 


Updated Date - 2021-01-16T12:59:13+05:30 IST