ఓటీఎస్ అధికారం ఎవరిచ్చారు ?: నల్లారి కిశోర్
ABN , First Publish Date - 2021-12-08T05:21:07+05:30 IST
కాలనీ ఇళ్ల బిల్లులు ఇచ్చే సత్తా లేనప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ఓటీఎస్ అధికారం ఎవరిచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రశ్నించారు.
పీలేరు, డిసెంబరు 7: కాలనీ ఇళ్ల బిల్లులు ఇచ్చే సత్తా లేనప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ఓటీఎస్ అధికారం ఎవరిచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రశ్నించారు. పీలేరులో మంగళవారం నిర్వహిం చిన టీడీపీ గౌరవసభలో ఆయన మాట్లాడారు. వన్టైమ్ సెటిల్మెంటుకు ఒప్పుకోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని, రేషన్ కార్డు తీసేస్తామని బెదిరిస్తున్నారని విమర్శిం చారు. మహిళలను కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యలు చేయడం అమానుషమని, మహిళలు ఏకతాటిపైకి వచ్చి ఈ అరాచక పాలనను అంతం చేయాలన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబురెడ్డి, మాజీ జడ్పీటీసీ రెడ్డిబాషా, తెలుగు యువత అధికార ప్రతినిధి స్పోర్ట్స్ మల్లి, నాయకులు పురం రామ్మూర్తి, ఎన్.అమరనాథరెడ్డి, బొజ్జిరెడ్డి, లడ్డూజాఫర్, లక్ష్మీకర్, రియాజ్, సూరి, రాజ, షౌకత్అలీ, రమాదేవి పాల్గొన్నారు.