వంటవారి సమస్యలు వినేదెవరు?
ABN , First Publish Date - 2021-04-11T08:19:44+05:30 IST
జీతాల కోసం మైనారిటీ గురుకులాల్లోని వంటవారు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో వంటపని చేసే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నా..
మైనారిటీ గురుకులాల్లో ఏడాదిగా జీతాల్లేవ్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జీతాల కోసం మైనారిటీ గురుకులాల్లోని వంటవారు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో వంటపని చేసే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నా.. మైనారిటీ గురుకులాల్లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం గా ఉంది. 228 మైనారిటీ గురుకులాల్లో ప్రతి గురుకులానికి ఇద్దరు వంట మనుషులు, ముగ్గురు సహాయకులుఉంటారు. మొత్తం వీరి సంఖ్య 1100 వరకు ఉంది. వంటమనిషికి రూ. 12 వేలు, హెల్పర్కి రూ.10 వేల చొప్పున వే తనం ఉండేది. గతేడాది లాక్డౌన్ తర్వాత విద్యా సంస్థలను బంద్ చేశారు. వీరికి జీతాలు చెల్లించడం లేదు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా, జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అయినా కార్యదర్శి షఫీవుల్లా పట్టించుకోవడం లేదని మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూఖ్ హుసేన్ ఆరోపించారు.