ప్రభుత్వ అధికారులు ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదు? మనీశ్ తివారీ

ABN , First Publish Date - 2021-01-16T22:08:01+05:30 IST

వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ మనీశ్

ప్రభుత్వ అధికారులు ఎందుకు  వ్యాక్సిన్  తీసుకోలేదు? మనీశ్ తివారీ

న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కేంద్రం వ్యవహార శైలిపై ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతంగా ఉంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి ఎందుకు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకు రాలేదు? అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నిజంగానే వ్యాక్సిన్ అంత సురక్షితమైతే... అంత సమర్థవంతమైనదే అయితే ఇతర దేశాల్లో లాగా ప్రభుత్వ అధికారులు ఎందుకు ముందుకు రాలేదు? కోవ్యాగ్జిన్ సమర్థతపై చాలా మంది వైద్యులు ప్రశ్నలు లేవనెత్తారు.’’ అని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-16T22:08:01+05:30 IST