అంత కోపమెందుకు ‘అన్నా’!

ABN , First Publish Date - 2021-01-17T08:49:41+05:30 IST

‘ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేదా.. పొద్దున కూడా దిగూ(కారు) దిగూ అన్నావ్‌.. బలిసిందా నీకు.. అంత బలుపా?..

అంత కోపమెందుకు ‘అన్నా’!

  • జనసేన కార్యకర్తపై వైసీపీ ఎమ్మెల్యే చిందులు
  • సమస్యలపై ప్రశ్నిస్తే రెచ్చిపోయిన రాంబాబు

బేస్తవారపేట, జనవరి 16: ‘ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేదా.. పొద్దున కూడా దిగూ(కారు) దిగూ అన్నావ్‌.. బలిసిందా నీకు.. అంత బలుపా?..  నన్నే ప్రశ్నిస్తావా రా! నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి? కండువా తీసెయ్‌ ముందు. ఆ తర్వాత మాట్లాడు’ అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. జనసేన కార్యకర్తపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బేస్తవారపేట మండలం సింగన్నపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ  ఎమ్మెల్యే రాంబాబు రాగా.. జనసేన సీనియర్‌ కార్యకర్త దుమ్మని చంద్రశేఖర్‌, మరికొంత మందితో కలిసి వాహనానికి ఎదురెళ్లారు. ఇళ్ల స్థలాలతోపాటు.. మా ఊరు రోడ్డు సమస్య ఎందుకు పరిష్కరించలేదు? ఇతర సమస్యల న్నీ అలాగే ఉన్నాయి? అభివృద్ధి పనులు పట్టవా? అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రాం బాబు కారులో నుంచే.. తీవ్ర ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ‘ముందు ఆ మెడలో టవల్‌ తీసేయ్‌..  మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతుల ను పక్కన పెట్టుకొని వచ్చి ప్రశ్నిస్తే మేము చెప్పాలా’ అంటూ హెచ్చరిక ధోరణలో మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు  జనసేన కార్యకర్తకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు.  

Updated Date - 2021-01-17T08:49:41+05:30 IST