పెళ్లి వద్దన్న వితంతువు... నాలిక తెగ్గోసిన అత్తింటివారు!

ABN , First Publish Date - 2020-11-18T17:37:02+05:30 IST

రాజస్థాన్‌లో పెళ్లికి నిరాకరించిన ఒక వితంతువుపై దాడి జరిగింది. ఆమె ముక్కు, నాలికను తెగ్గోశారు.

పెళ్లి వద్దన్న వితంతువు... నాలిక తెగ్గోసిన అత్తింటివారు!

జైపూర్: రాజస్థాన్‌లో పెళ్లికి నిరాకరించిన ఒక వితంతువుపై దాడి జరిగింది. ఆమె ముక్కు, నాలికను తెగ్గోశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే జైసల్మేర్ జిల్లాలోని 28 ఏళ్ల వితంతువు రెండో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో అత్తింటివారు ఆమె ముక్కును, నోటిలోని నాలికను తెగ్గోశారు. 


ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రధాన నిందితులను ఆరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని చికిత్స కోసం జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఠాణీ నివాసి బీసర్ ఖాన్ ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో బీసర్ ఖాన్... తన సోదరి గుడ్డీకి ఆరేళ్ల క్రితం కోజె ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది తరువాత కోజె ఖాన్ మృతి చెందాడు. ఆ తరువాత తన చెల్లెలిని ఆమె అత్తారింటివారు మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా ఆమె అందుకు నిరాకరించింది. ఈ నేపధ్యంలోనే ఆమెపై దాడి చేసి, ముక్కు, నాలిక తెగ్గోయడంతో పాటు ఆమె ఎడమ చేతిని కూడా విరగ్గొట్టారు. ఆమెను కాపాడేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-18T17:37:02+05:30 IST