భర్త మరణం.. నలుగురు పిల్లలు ఉన్నా ఆ 30 ఏళ్ల మహిళ ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిస్తోందని గుండు గీసి..

ABN , First Publish Date - 2021-08-04T02:42:42+05:30 IST

భర్త చనిపోయిన ఒక మహిళ వేరే యువకుడితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చావబాది గుండు గీశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సాబర్‌కాంఠా జిల్లాలో జరిగింది.

భర్త మరణం.. నలుగురు పిల్లలు ఉన్నా ఆ 30 ఏళ్ల మహిళ ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిస్తోందని గుండు గీసి..

ఇంటర్నెట్ డెస్క్: భర్త చనిపోయిన ఒక మహిళ వేరే యువకుడితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చావబాది గుండు గీశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సాబర్‌కాంఠా జిల్లాలో జరిగింది. ఇక్కడ స్థానికురాలైన ఒక 30 ఏళ్ల మహిళ కొంతకాలం క్రితం భర్తను కోల్పోయింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె.. వేరే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో కొందరు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా కొట్టి, చివరకు బలవంతంగా గుండు గీయించారు.


ఆమె ప్రేమాయణం నడిపినట్లు చెప్తున్న వ్యక్తికి అప్పటికే పెళ్లి అయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అతన్ని బాధితురాలు వలలో వేసుకుందని, దీంతో అతను కుటుంబాన్ని లక్ష్యపెట్టడం లేదని ఆరోపించిన కొందరు.. బాధితురాలిపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వాదన్‌సింహ్ చౌహాన్, రాజూజీ చౌహాన్, కాలూసింహ్ చౌహాన్, రాకేష్‌సింహ్ చౌహాన్, సురేఖా చౌహాన్, సోనల్ చౌహాన్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2021-08-04T02:42:42+05:30 IST