ఆవేశంలో భర్తను కొట్టిన భార్య.. భర్త మృతి

ABN , First Publish Date - 2020-09-21T15:23:51+05:30 IST

భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సరిత దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ

ఆవేశంలో భర్తను కొట్టిన భార్య.. భర్త మృతి

అనంతపురం: భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సరిత దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన భార్య సరిత.. తన భర్త శ్రీనివాసులుని కర్రతో బలంగా కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో శ్రీనివాసులు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-09-21T15:23:51+05:30 IST