భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-12T05:31:28+05:30 IST
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
కులకచర్ల: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బొంరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని మందిపాల్ గ్రామానికి చెందిన నర్సింహులు కూతురు రవళి(21)కి గత రెండు సంవత్సరాల క్రితం మండలంలోని బొంరెడ్డిపల్లికి చెందిన రోజుతో వివాహం జరిపించారు. రాజు హైదరాబాద్లో ఉంటూ ఆటోనడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆటోఫైనాన్స్ చెల్లించడంలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో రవళి పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని భర్త రాజు వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె అత్తవారి ఇంట్లోనే శుక్రవారం ఉదయం చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు.