భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని...

ABN , First Publish Date - 2020-08-31T12:28:25+05:30 IST

కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆ భర్త భార్యపై చేయి చేసుకున్నాడు..

భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని...

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆ భర్త భార్యపై చేయి చేసుకున్నాడు.. దాంతో ఆమె పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తన ఇద్దరు కొడకులను తీసుకుని ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మీర్‌పేట్‌కు చెందిన ఎం.భానుప్రసాద్‌, చంద్రిక దంపతులు ఈ నెల 24వ తేదీన స్వల్ప విషయమై ఇంట్లో గొడవ పడ్డారు. భర్త కోపంతో భార్య చంద్రికను కొట్టడంతో ఆమె ఆవేశంగా మీర్‌పేట్‌ పీఎస్‌‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.


దీనిని అవమానంగా భావించిన భానుప్రసాద్‌ ఆమె వచ్చేలోగా ఇద్దరు కుమారులు వినయ్‌(9), విజయ్‌(7)లను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం రాత్రి మీర్‌పేట్‌ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దరాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-08-31T12:28:25+05:30 IST