భర్తను అలా చూసి తట్టుకోలేకపోయిన భార్య.. ఊపిరి వదిలేసింది.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-01-03T01:06:37+05:30 IST

వారిద్దరికీ 58ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇన్నేళ్లుగా కష్టసుఖాలను కలిసి పంచుకున్నారు. తాజాగా భర్త అనూహ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ ఇల్లాలు.. తన ఊపిరి కూడా వదిలేసింది. భర్తతో కలి

భర్తను అలా చూసి తట్టుకోలేకపోయిన భార్య.. ఊపిరి వదిలేసింది.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరికీ 58ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇన్నేళ్లుగా కష్టసుఖాలను కలిసి పంచుకున్నారు. తాజాగా భర్త అనూహ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ ఇల్లాలు.. తన ఊపిరి కూడా వదిలేసింది. భర్తతో కలిసి చితిని పంచుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన రాణారామ్ సెన్ (78), భన్వారి దేవీ (75)కి 58ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత వారికి ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. ఆ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లుకూ పెళ్లిళ్లు చేసేశారు. కాగా.. ఇన్నేళ్లు కష్టసుఖాలను కలిసి పంచుకున్న ఆ భార్యాభర్తలు చివరికి చితిని కూడా పంచుకున్నారు.  రాణారామ్ అకస్మత్తుగా శనివారం రోజు తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆసుపత్రి నుంచి వచ్చిన భర్త మృతదేహాన్ని చూసిన భన్వారి దేవీ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. దీంతో ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి అంత్యక్రియలు చేశారు. తల్లిదండ్రుల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి.. ఆ చితికి నిప్పంటించారు. 




Updated Date - 2022-01-03T01:06:37+05:30 IST