ఆరున్నర లక్షల నగదుతో గృహిణి అదృశ్యం

ABN , First Publish Date - 2020-11-18T14:31:04+05:30 IST

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది.

ఆరున్నర లక్షల నగదుతో గృహిణి అదృశ్యం

హైదరాబాద్/కవాడిగూడ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. గాంధీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కవాడిగూడ తుల్జాభవాని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌, మొదటి భార్య చనిపోవడంతో చంద్రిక(45)ను రెండోవివాహం చేసుకున్నాడు. ఈనెల 15వ తేదీన సాయంత్రం ఆరుగంటల సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లిన చంద్రిక తిరిగిరాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.


ఈ మేరకు చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేయడంతో గాంధీనగర్‌ ఎస్‌ఐ రమేష్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన ఇంట్లో బీరువాలో ఉన్న ఆరున్నర లక్షల రూపాయలు కూడా కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌ నెం.04027853585, లేదా 8333900133, గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

Updated Date - 2020-11-18T14:31:04+05:30 IST