భర్తకు షాకిచ్చిన భార్య.. 8 ఏళ్లుగా గుట్టుగా చేస్తున్న పనిని ఆధారాలతో సహా బయటపెట్టడంతోపాటు..

ABN , First Publish Date - 2022-01-21T01:21:51+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ తన భర్తకు షాకిచ్చింది. అతడు ఎనిమిదేళ్లుగా చేస్తోన్న మోసం గురించి ఆధారాలతోపాటు బయటపెట్టింది. ఆగ్రహంతో ఊగిపోతోన్న భర్తను అందరూ చూస్తుండగానే ఎదురించింది. ఈ ఘట

భర్తకు షాకిచ్చిన భార్య.. 8 ఏళ్లుగా గుట్టుగా చేస్తున్న పనిని ఆధారాలతో సహా బయటపెట్టడంతోపాటు..

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ తన భర్తకు షాకిచ్చింది. అతడు ఎనిమిదేళ్లుగా చేస్తోన్న మోసం గురించి ఆధారాలతోపాటు బయటపెట్టింది. ఆగ్రహంతో ఊగిపోతోన్న భర్తను అందరూ చూస్తుండగానే ఎదురించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె ఇలా చేయడానికి గల కారణం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని రట్లం ప్రాంతానికి చెందిన మీన, సునీల్‌కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి ఒక కొడుకు కూడా జన్మించాడు. కాల క్రమంలో ఈ దంపతుల మధ్య క్రమంగా గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు మీనాను సునీల్ చితకబాదేవాడు. అయితే భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఓపికగా ఎదురు చూసిన మీన.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తన భర్త మారడని ఆమె నిర్ణయించుకుంది. భర్తకు ఎలాగైనా తగిన బుద్ధి చెప్పాలని భావించింది.



ఇందులో భాగంగానే ఎనిమిదేళ్ల క్రితం సునీల్ ప్రారంభించిన కల్తీ నెయ్యి వ్యాపారం గురించి.. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేసి 38 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీలు ప్రారంభించగానే సునీల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మీనాపై దాడి చేయడం ప్రారంభించాడు. అయితే మీన మాత్రం.. అందరూ చూస్తుండగానే తన భర్తను పక్కకు తోసేసింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్న కారణంగా సునీల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. కాకపోతే, అతడిని అదుపులోకి తీసుకునే లోపే సునీల్.. అక్కడి నుంచి పరారయ్యాడు.




Updated Date - 2022-01-21T01:21:51+05:30 IST