చాలా నిజాయితీపరుడని కితాబిచ్చి మరీ భర్తను Onlineలో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-22T02:14:24+05:30 IST

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సహజం. అయితే ఈ కోపతాపాలు చల్లారడానికి ఎంతో సమయం పట్టదు. నిమిషాల వ్యవధిలోనే మళ్లీ దగ్గరవుతూ ఉంటారు. కానీ భర్తపై కోపంతో ఓ భార్య మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. దీంతో ఆమె చేసిన పని ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా

చాలా నిజాయితీపరుడని కితాబిచ్చి మరీ భర్తను Onlineలో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సహజం. అయితే ఈ కోపతాపాలు చల్లారడానికి ఎంతో సమయం పట్టదు. నిమిషాల వ్యవధిలోనే మళ్లీ దగ్గరవుతూ ఉంటారు. కానీ భర్తపై కోపంతో ఓ భార్య మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. దీంతో ఆమె చేసిన పని ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. భర్తను అమ్మకానికి పెట్టేంత కోపం ఆ భార్యకు ఎందుకొచ్చింది? ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చిన తర్వాత ఆమె భర్త రియాక్షన్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..


న్యూజిలాండ్‌కు చెందిన మహిళకు ఓ వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య చిన్న గొడవలు జరిగినా.. వాటిని ఆ మహిళ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తాజాగా భర్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆమెకు పట్టలేనంత కోపం వచ్చింది. నడిచే అలవాటు ఉన్న కారణంగా వేళాపాళా లేకుండా.. సరిగ్గా పిల్లలను చూసుకోవాల్సి వచ్చినపుడే చెప్పాపెట్టకుండా వాకింగ్ వెళ్తుండటంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది.



‘ఈయన వయసు 37ఏళ్లు. పొడవు 6 అడుగుల 1 అంగుళం. వృత్తి రీత్యా రైతు. భార్యను బాగా చూసుకోవడమే కాకుండా నిజాయితీగా ఉంటాడు. నచ్చితే సంప్రదించండి. యూజ్డ్ కండిషన్‌లో ఉన్న ఈయనను ఎవరైనా కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఫ్రీ’ అంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ సైట్‌లో ప్రకటన ఇచ్చింది. దీంతో ఆ ప్రకటన కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో 12 మంది బిడ్‌లను కూడా దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత సదరు మహిళ ఈ ప్రకటనను తీసేశారు. కాగా.. భార్య చేసిన పని భర్త దృష్టికి వెళ్లడంతో అతడు పడిపడి నవ్వుకున్నాడట.



Updated Date - 2022-01-22T02:14:24+05:30 IST