గొల్లవిల్లిలో భార్యాభర్తలు మృతి

ABN , First Publish Date - 2021-05-09T07:41:57+05:30 IST

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు.

గొల్లవిల్లిలో భార్యాభర్తలు మృతి
సలాది కృష్ణారావు (ఫైల్‌ఫొటో)

ఉప్పలగుప్తం, మే 8: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు. దీంతో గ్రామంలో ఇప్పటివరకు ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. ఫోటో స్టూడియో యజమాని, ఫోటోగ్రాఫర్స్‌ సంక్షేమ సంఘం జిల్లా సభ్యుడు సలాది కృష్ణారావు, భార్య వెంకటలక్ష్మి కరోనాతో అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. వీరి ఐదేళ్ల కుమారుడు అమ్మనాన్నల కోసం ఎదురు చూడడం అందరి హృదయాలను కదిలిస్తోంది. వారం రోజుల కిందట కృష్ణారావు అన్న నాగబాబు కరోనాతో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.



Updated Date - 2021-05-09T07:41:57+05:30 IST