మద్యం మత్తులోనే హత్య

ABN , First Publish Date - 2022-01-29T06:57:29+05:30 IST

మద్యం మత్తులోనే రఘుదేవపురం గ్రామానికి చెందిన మర్రే ముత్యాలమ్మ తన భర్త మర్రే అబ్బులును హత్య చేసిందని నార్త్‌జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

మద్యం మత్తులోనే హత్య

  • నార్త్‌జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు
  • భర్తను హత్య చేసిన భార్య అరెస్టు

సీతానగరం, జనవరి 28: మద్యం మత్తులోనే రఘుదేవపురం గ్రామానికి చెందిన మర్రే ముత్యాలమ్మ తన భర్త మర్రే అబ్బులును హత్య చేసిందని నార్త్‌జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26న రాత్రి అబ్బులు, భార్య ముత్యాలమ్మ మద్యం తాగి ఇంటివద్ద గొడవపడి ఇంటినుంచి రాపాక రోడ్డు కల్వర్టు వద్దకు చేరుకున్నారన్నారు. అక్కడ ఇద్దరూ ఘర్షణపడి మద్యంమత్తులో ముత్యాలమ్మ భర్త పురుషాంగాన్ని కొరికి పాడయిన మరుగుదొడ్డి సింక్‌ తీసుకుని ముఖంపై కొట్టి హతమార్చిందన్నారు. రాత్రి సంఘటనాస్థలం నుంచి ఇంటికి చేరుకున్న ఆమె తెల్లవారాక మృతదేహాన్ని ఇంటికి చేర్చి భర్త ఫిట్స్‌తో చనిపోయాడని నిమ్మించడానికి ప్రయత్నించిందని చెప్పారు. స్థానిక ఎస్‌ఐ శుభశేఖర్‌ ముత్యాలమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు.

Updated Date - 2022-01-29T06:57:29+05:30 IST