భర్తతో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన భార్య.. మరొకరితో బైక్‌పై పరారీ

ABN , First Publish Date - 2021-04-06T12:05:40+05:30 IST

రాజస్థాన్‌ వెళ్లేందుకు భార్యాభర్తలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు....

భర్తతో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన భార్య.. మరొకరితో బైక్‌పై పరారీ

హైదరాబాద్/అడ్డగుట్ట : రాజస్థాన్‌ వెళ్లేందుకు భార్యాభర్తలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. నీళ్ల బాటిల్‌ కోసం వెళ్లిన భార్య పరుగెత్తుకుంటూ వెళ్లి మరో వ్యక్తి బైక్‌ ఎక్కి పారిపోయింది. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ బారీ ఖోకుండా రోడ్డు గ్రామానికి చెందిన ప్రభుదాస్‌ ఎల్‌ అండ్‌ టీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2018లో రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఈనెల 2న హైదరాబాద్‌లో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి భార్యా కుమారుడితో కలిసి ప్రభుదాస్‌ వచ్చాడు. ఈనెల 4న తిరిగి రాజస్థాన్‌ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు భార్య, కుమారుడితో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.


స్టేషన్‌ బయట కొద్దిసేపు నిలబడి ఉన్నారు. నీళ్ల బాటిల్‌ తీసుకొస్తానని చెప్పి కుమారుడిని తీసుకెళ్లిన రమ్య ఓ వ్యక్తి బైక్‌ ఎక్కి వెళ్లిపోయింది. చాలాసేపు అయినా, తిరిగి భార్య రాకపోవడంతో ప్రభుదాస్‌ ఆ ప్రాంతంలో గాలించాడు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో గోపాలపురం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య రూ. 20 వేలు, రెండు తులాల బంగారు నగలతో ఓ వ్యక్తితో కలిసి పారిపోయిందని ప్రభుదాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బైక్‌ నంబర్‌ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-04-06T12:05:40+05:30 IST