‘భార్యే కడతేర్చింది’
ABN , First Publish Date - 2020-12-01T06:17:24+05:30 IST
మండలంలోని కోల్మాన్పేట గ్రామా నికి చెందిన కిందింటి గోవిందును భార్యే కడతేర్చిందని డీఎస్పీ సోమవారం తెలిపారు.
కోసిగి, నవంబరు 30: మండలంలోని కోల్మాన్పేట గ్రామా నికి చెందిన కిందింటి గోవిందును భార్యే కడతేర్చిందని డీఎస్పీ సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. నవంబరు 27న గోవిందు పొలంలో హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనుంజయ్ లోతుగా విచారణ చేశారు. తానే భర్తను వేటకొడవలితో హత్యచేసినట్లు భార్య కిందింటి తిక్కమ్మ వీఆ ర్వో సమక్షమంలో నేరాన్ని అంగీకరించింది. గోవిందు దివ్యాం గురాలైన కూతురిపై దాడికి పాల్పడటంతోనే హత్య చేసినట్లు నింది తురాలు తెలిందన్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ అన్నారు.