రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. ఆరా తీస్తే భార్య గురించి బయటపడ్డ సంచలన విషయాలు..
ABN , First Publish Date - 2021-12-25T22:09:04+05:30 IST
ఇటుపక్క దట్టమైన అడవి.. అటువైపు రైల్వే ట్రాక్. ఈ రెండింటి మధ్యలో గుర్తు తెలియని మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందడంతో.. అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకు
ఇంటర్నెట్ డెస్క్: ఇటుపక్క దట్టమైన అడవి.. అటువైపు రైల్వే ట్రాక్. ఈ రెండింటి మధ్యలో గుర్తు తెలియని మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందడంతో.. అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతడి భార్య గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని దారా సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పరిసరాల్లో గుర్తు తెలియని మృతదేహం ఉందంటూ డిసెంబర్ 11న స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అతడిని అక్లేరా ప్రాంతానికి చెందిన ఓమ్ ప్రకాశ్(32) గా గుర్తించారు. అంతేకాకుండా ఓమ్ ప్రకాశ్ మరణానికి కారణం అతడి భార్యే అని పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి భార్య కృష్ణ.. ఓమ్ ప్రకాశ్ను హతమార్చినట్టు కనుగొన్నారు.
ఈ క్రమంలోనే ఓమ్ ప్రకాశ్ భార్య కృష్ణను ఆమె ప్రియుడు ధన్రాజ్ అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఓమ్ ప్రకాశ్ స్థానికంగా ఉన్న కంపెనీలో లేబర్గా పని చేస్తుండగా.. ధన్రాజ్తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధన్రాజ్ తరచూ ఓమ్ ప్రకాశ్ ఇంటి వెళ్తుండేవాడని చెప్పారు. ఇదే సమయంలో ధన్రాజ్, ఓమ్ ప్రకాశ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు వెల్లడించారు. అయితే విషయం ఓమ్ ప్రకాశ్కు తెలియడంతో అతడు ధన్రాజ్ను హెచ్చరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో కలిసి బయటికెళ్లిన కృష్ణ.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ధన్రాజ్ అతడి స్నేహితుడితో కలిసి ఓమ్ ప్రకాశ్ను హతమార్చినట్టు పేర్కొన్నారు.