మంచానికి కట్టి కోసేసింది!
ABN , First Publish Date - 2020-06-05T08:49:23+05:30 IST
రోజూ తాగొచ్చి వేధించే భర్తను కొన్నేళ్లుగా భరిస్తూ వచ్చిన భార్యలో ఓపిక నశించింది. భర్తను మంచానికి కట్టేసి అతని మర్మాంగాలను బ్లేడుతో కోసి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా
- వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య.. పశ్చిమలో కలకలం
టి.నరసాపురం, జూన్ 4: రోజూ తాగొచ్చి వేధించే భర్తను కొన్నేళ్లుగా భరిస్తూ వచ్చిన భార్యలో ఓపిక నశించింది. భర్తను మంచానికి కట్టేసి అతని మర్మాంగాలను బ్లేడుతో కోసి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మక్కినవారిగూడేనికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేటకు చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె ఉంది. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పారావు రోజూ మద్యం సేవించి వేధించేవాడు. పెద్దలకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో గురువారం అతన్ని మంచానికి కట్టేసి బ్లేడుతో మర్మాయవాలు కోసేసి హతమార్చింది.