సెల్ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను హత్య చేసిన భర్త
ABN , First Publish Date - 2020-06-01T16:46:08+05:30 IST
ఏలూరు: సెల్ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను ఓ భర్త హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో చోటు చేసుకుంది.
ఏలూరు: సెల్ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను ఓ భర్త హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జింగ్ వైరు మెడకు చుట్టి భార్య దుర్గ(29)ను భర్త సురేష్ హత్య చేశాడు. భర్తతో విభేదాల కారణంగా దుర్గ తన పుట్టింట్లోనే ఉంటోంది. అయితే మూడు రోజుల క్రితం సురేష్ అత్తారింటికి వచ్చాడు. సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే దుర్గను సురేష్ హత్య చేశాడు.