అప్పటి వరకూ పిల్లల పక్కనే పడుకుని ఉన్న భర్త.. పాల ప్యాకెట్ కోసం వెళ్లొచ్చి ఇంట్లోని దృశ్యం చూసి ఆమె షాక్

ABN , First Publish Date - 2021-09-30T00:53:47+05:30 IST

తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమె నిద్రలేచి.. ఇంట్లోని పనులు పూర్తి చేసింది. అప్పటికీ ఆమె భర్త.. గాఢ నిద్రలోనే ఉన్నాడు. పిల్లల పక్కనే పడుకుని ఉన్న ఆయనను లేపడం ఇష్టంలేక.. పాల ప్యాకేట్ కోసం పక్కనే ఉన్న దుకాణానికి ఆమే వెళ్లింది. 15

అప్పటి వరకూ పిల్లల పక్కనే పడుకుని ఉన్న భర్త.. పాల ప్యాకెట్ కోసం వెళ్లొచ్చి ఇంట్లోని దృశ్యం చూసి ఆమె షాక్

ఇంటర్నెట్ డెస్క్: తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమె నిద్రలేచి.. ఇంట్లోని పనులు పూర్తి చేసింది. అప్పటికీ ఆమె భర్త.. గాఢ నిద్రలోనే ఉన్నాడు. పిల్లల పక్కనే పడుకుని ఉన్న ఆయనను లేపడం ఇష్టంలేక.. పాల ప్యాకేట్ కోసం పక్కనే ఉన్న దుకాణానికి ఆమే వెళ్లింది. 15 నిమిషాల తర్వాత పాల ప్యాకేట్‌తో ఇంటికొచ్చిన ఆ ఇల్లాలు.. ఇంట్లోని దృశ్యం చూసి ఒక్కసారిగా కుప్పకూలింది. గుండెలు బాదుకుంటూ రోదించడం మొదలు పెట్టిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



రాజస్థాన్‌లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన మహేంద్ర ఖారది, రేఖ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు కూడా పుట్టారు. కాగా.. ఎప్పటిలాగే మంగళవారం రోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే నిద్ర లేచిన రేఖ.. ఇంట్లోని పనులు పూర్తి చేసింది. టీ పెట్టిన తర్వాత భర్తను, పిల్లలను నిద్రలేపుదామని భావించి.. పక్కనే ఉన్న దుకాణంలోకి పాల ప్యాకెట్ కోసం వెళ్లింది. 15 తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. ఇంట్లో భర్త ఉరివేసుకుని ఉండటాన్ని చూసి అక్కడే కుప్పలింది. ఆమె రోదనలు విన్న చుట్టుపక్కల జనం.. అక్కడకు చేరుకుని.. మహేంద్ర ఖారదిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన మృతికి ఇంట్లోని సమస్యలు కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. 


Updated Date - 2021-09-30T00:53:47+05:30 IST