వైఫై విషయమై వివాదం.. కేర్టేకర్పై దాడి
ABN , First Publish Date - 2020-11-12T13:48:17+05:30 IST
వైఫై విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
హైదరాబాద్/ఆమీర్పేట : వైఫై విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అడ్డుకోబోయిన కేర్టేకర్ను హాస్టల్ యజమాని చితకబాదాడు. అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, నారాయణరెడ్డి గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ డిగ్రీ పూర్తి చేశాడు. నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. వెంగళరావునగర్లో హాస్టల్ నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన రవీందర్రెడ్డి వద్ద కేర్టేకర్గా పనిచేస్తూ ఎస్ఐ పరీక్షలు రాసేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నెల 9వ తేదీన వైఫై రాకపోవడంతో హాస్టల్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్న శ్రీనివాస్ హాస్టల్ నిర్వాహకుడితో గొడవ పడుతున్నాడు. వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లారు. గమనించిన నాగేంద్రప్రసాద్ వారిని అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన రవీందర్రెడ్డి రబ్బరు పైపుతో నాగేంద్రప్రసాద్ను చితకబాదాడు. బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు.