మద్యం మాల్స్కు రాజన్న, జగనన్న పేర్లు పెడతారా!: ఉమా
ABN , First Publish Date - 2020-09-27T09:11:30+05:30 IST
మద్యం మాల్స్కు.. రాజన్న, జగనన్న లిక్కర్ మాల్స్ అని పేర్లు పెడతారా!’’ అంటూ మాజీ మంత్రి దేవినే ని ఉమ ఎద్దేవ చేశారు...
కైకలూరు, సెప్టెంబరు 26: ‘‘రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మద్యం మాల్స్ ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య. మాల్స్కు.. రాజన్న, జగనన్న లిక్కర్ మాల్స్ అని పేర్లు పెడతారా!’’ అంటూ మాజీ మంత్రి దేవినే ని ఉమ ఎద్దేవ చేశారు. శనివారం ఆయన కైకలూరులో మాట్లాడారు. గతం లో రూ.50 ఉండే చీప్ లిక్కర్ ధర నేడు రూ.150కి పైగా పలుకుతోందన్నారు. ఇవి తాగిన వారు 3ఏళ్లలో మృత్యువాత పడతారని వైసీపీ ఎంపీనే మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాతలకు ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని అన్నారు.